యాంకర్ అనసూయ.. ఈ అమ్మడి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు అపరిచితురాలు ఈమె. కానీ జబర్దస్త్ లో యాంకర్ గా అవతారం ఎత్తిన తర్వాత మాత్రం కొన్ని రోజుల్లోనే అందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది. జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు జబర్దస్త్ అనే కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ షో లోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది అనసూయ. అయితే కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే తన కెరియర్ ముగించకుండా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.
 

 ఇక సినిమాల్లో కూడా వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అని చెప్పాలి. అంతే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా డాన్స్ తో ఇరగదీసి అందరినీ ఆకట్టుకుంది. పెళ్లయిన తర్వాత ఇవేం పనులు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ నా లైఫ్ నా ఇష్టం అంటూ అందరికీ కౌంటర్ ఇస్తూ దూసుకుపోతుంది ఈ సొగసరి. అయితే ఇక తెలుగు ప్రేక్షకులందరికీ రంగమ్మత్త గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అటు వెండి తెరపై పెద్దగా కనిపించక పోయినా తెరపై మాత్రం తెగ సందడి చేస్తుంది అనసూయ.


 ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమంలో యాంకరింగ్ తో అదరగొడుతుంది. ఇక అప్పుడప్పుడు హైపర్ ఆది స్కిట్ లో భాగం అవుతూ అదిరిపోయే పంచులు కూడా వేస్తూ ఉంటుంది ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది స్కిట్ లో భాగం అయిన అనసూయ చెప్పే డైలాగ్ ఒకటి ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. హైపర్ ఆది-అనసూయ ఒక టేబుల్ పై కూర్చుంటారు. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అనసూయ అంటూ హైపర్ ఆది  అడగగా.. ఇలాంటి క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఒక గట్టి హాగ్ మా ఆయన భరద్వాజ ఇస్తే ఎంత బాగుంటుంది అంటూ చెబుతుంది అనసూయ. అప్పుడు నాకుఅంతా బొక్క తప్ప ఇంకేమీ ఉండదు అంటూ హైపర్ ఆది పంచ్ వేస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: