హీరో సాయికుమార్ ఎంతటి గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే. ఇక తాజాగా కార్తికేయ నటిస్తున్న రాజా విక్రమార్క సినిమా లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు సాయికుమార్. నిన్నటి రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలో సాయి కుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు..వాటి గురించి చూద్దాం.

సాయికుమార్ మాట్లాడుతూ.. తను ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. తను చేస్తున్న ప్రతి సినిమా ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ నూ ఇస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అలాంటి పాత్ర రావడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ సరిపల్లి ఈ కథను తనకు వినిపించినప్పుడు చాలా బాగా నచ్చింది. నా కొడుకు ఆది ఎలానో ఇప్పుడు వచ్చిన హీరోలందరూ నాకు అలాగే అని చెప్పుకొచ్చాడు.S.R. కళ్యాణ మండపం తో హీరో కిరణ్ ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ లో కూడా నాకు భాగం ఉన్నందుకు చాలా ఆనంద పడుతున్నాను అని చెప్పుకొచ్చాడు.

రాజా విక్రమార్క ఒక బ్యూటిఫుల్ ఫిలిమ్. ఇక ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు కావడం విశేషం. తనికెళ్ల భరణి, పసుపతి గారితో ఈ సినిమాలో నటించడం నాకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు సాయికుమార్. యువ హీరోలందరూ ఇప్పుడు వారి పనుల మీద చాలా శ్రద్ధ పెట్టి నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి హీరోలకు నాదొక చిన్న సలహా అంటూ..

హీరోలంతా కలిసి గట్టు గా ఉండడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరి అభిమానులు కూడా సినిమాలను ఒకేలాగ ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా ఇండస్ట్రీ మనందరిదీ అనుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వల్ల నిర్మాతలకు మంచి జరగాలి, అలాగే హీరో హీరోయిన్లకు మంచి సక్సెస్ రావాలని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: