నోరులేని జీవాలే కదా అంటూ వాటిని తక్కువగా అంచనా వేయనే కూడదు అవసరం వచ్చినప్పుడు మనుషుల కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తాయని తెలుస్తుంది.

ముఖ్యంగా పెంపుడు కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తమ యజమానుల గురించి ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయని తెలుస్తుంది.అలాంటి తమ యజమాని ప్రాణం పోయింది అంటే వాటి ప్రాణాలు ఇచ్చేయడానికి కూడా వెనకాడవట. గతేడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయన పెంపుడు కుక్క కూడా వారం రోజుల పాటు ఏమీ తినకుండా అనారోగ్యం పాలైందని చివరికి వాళ్ల కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప అది ప్రాణాలతో బయట పడలేదని తెలుస్తుంది.ఇప్పుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పెంపుడు కుక్కలు పరిస్థితి కూడా ఇలాగే తయారైందని సమాచారం.

పునీత్ రాజ్‌కుమార్‌ అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే . ఆ రోజు నుంచి కన్నడిగులు కన్నీరు పెడుతూనే ఉన్నారట. అప్పు లేడనే బాధను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఇప్పటికే దాదాపు 15 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇదిలా ఉంటే ఆయన ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కలు అప్పు ఇక రాడనే విషయాన్ని అర్థం చేసుకోలేక ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కూర్చుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలుస్తుంది.. వీటిని చూసి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని సమాచారం..

పునీత్ చనిపోయినప్పుడు ఆయన భౌతికకాయం దగ్గరికి పెంపుడు కుక్కలను తీసుకొచ్చారట. చాలా సేపు వరకూ వాటి యజమాని దగ్గర నుంచి కదలలేదని పునీత్ ఇక లేడని తిరిగి రాడని పాపం వాటికి అర్థం కాక అక్కడ చాలా సేపు వరకు ఉండిపోయాయని సమాచారం.ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత కూడా పునీత్ చిత్ర పటం దగ్గరికి వెళ్లి అక్కడే మౌనంగా కూర్చుని దీనంగా చూస్తున్నాయట రెండు పెంపుడు కుక్కలు. వీటి బాధ చూడలేక కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్నారని తెలుస్తుంది.ఎంతైనా మూగజీవాలు అందించే ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: