డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఏం చేసి కూడా గ్రాండియర్‌గా ఉంటుందని అందరికి తెలుసు.ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత ఆయన విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.తన లుక్ కూడా ఇది వరకు ఏ సినిమాలో లేనట్లు ఉండబోతుందని ఇక బాక్సింగ్ చిత్రం కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ని కూడా తీసుకొచ్చారని తెలుస్తుంది..

మైక్ టైసన్ ఫస్ట్ లుక్‌ను దీపావళి పండుగకు విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే. దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.. లైగర్ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో మైక్ టైసన్ పాత్రకు ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని తెలుస్తుంది.ఇందుకోసం పూరీ జగన్నాథ్.. అమితాబ్ బచ్చన్ మరియు బాలకృష్ణలను సంప్రదించారని వార్త వినిపిస్తుంది.హిందీలో బిగ్ బీ డబ్బింగ్ చెప్పనుండగా మరియు తెలుగులో బాలయ్య చెబుతారని తెలుస్తుంది.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయిన వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుందని తెలుస్తుంది.

లైగర్‌ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయడంతో పాటు ఛార్మితో కలిసి పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారని తెలుస్తుంది . అలాగే ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని వచ్చే ఏడాది సమ్మర్‌లో లైగర్‌ను విడుదల చేయడానికి పూరీ జగన్నాథ్ ప్లాన్స్ చేసుకుంటున్నారని సమాచారం.పూరి జగన్నాధ్ అంటే బాలయ్యకు ఎంత ఇష్టమో అందరికి తెలుసు.మరి చూడాలి మైక్ టైసన్ కు డబ్బింగ్ చెప్పడానికి బాలయ్య ఒప్పుకుంటారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: