స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నాడు వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. మంచి మంచి సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్ ని బిజీ గా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమా చేస్తున్న బన్నీ..ఆ తరువాత మాటల మాంత్రికుడు తో కూడా ఓ సినిమా ని లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో బన్నీ  సినిమా చేస్తున్నాడంటేనే  ఆ సినిమా హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ గా మారుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన మొదటి సారిగా హీరోయిన్ గా చేస్తున్న రష్మిక మందన ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టేసింది. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25 వ తేదీన విడుదల అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.


 ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని గతంలోనే క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. అయితే ఇప్పుడు పుష్ప హిందీ రైట్స్ విషయంలో అనుకోని చిక్కులో పడిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.‘పుష్ప’ మూవీని హిందీలో విడుదల చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూయించట్లేదట.  దీంతో చిత్రయూనిట్ అయోమయంలో పడిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం బయటకురావడంతో బన్నీ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ బన్నీకి బాలీవుడ్ లో అంత సీన్ లేదు అంటున్నారు. మరి కొందరు అయితే బన్నీకి భారీ బొక్క పడింది అంటున్నారు. ఈ విషయం సొషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: