ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు వెండి తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రాశికన్నా. మొదటి సినిమాతోనే తన చక్కటి అందం, మంచి నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా రాశిఖన్నా కి సరైన విజయం దక్కడం లేదు టాలీవుడ్ లో. దీంతో ఆమె కాస్త బ్రేక్ తీసుకొని అటు తమిళ చిత్రాల్లో అవకాశాలు రావడంతో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేసి వరుస సినిమాల్లో నటించింది. అయినా అక్కడ కూడా ఈ భామకి కలిసి రాలేదు. తమిళంలో ఆమె నటించిన మూడు సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.

అంతేకాదు రాశిఖన్నా లో మ్యాటర్ ఉంది కానీ, యాక్టింగ్ లేదంటూ కొందరు తమిళ విమర్శకులు ఆమెను ఓ రేంజిలో విమర్శించారు. దీంతోపాటు ఆమె నటించిన సినిమాలు నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తమిళం లో హీరోయిన్ గా గుర్తింపును దక్కించుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడికి అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇటీవలే మళ్లీ తమిళంలో జీవా సరసన ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది రాశిఖన్నా. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే తాజాగా టాలీవుడ్లో మరో అవకాశాన్ని దక్కించుకుంది రాశికన్నా.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ ఫైనల్ అయ్యింది. కాకపోతే ఈ సినిమాలో పరిధి దాటి ఆమె ఎక్స్ పోజింగ్ చేయాల్సి ఉంది. అయితే ఎలాగూ స్టార్ హీరోల సరసన నటించేందుకు ఈ మధ్యకాలంలో గ్లామర్ డోసు పెంచిన రాశి కన్నా.. సాయి తేజ్ సినిమా కోసం ఏమైనా చేస్తా అని అంటోందట. అంతేకాదు సాయి తేజ్ తనకు మంచి ఫ్రెండ్ అని.. తన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అన్నట్టు గతంలో సాయి తేజ్, రాశి ఖన్నా కాంబినేషన్లో 'సుప్రీమ్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత వీరిద్దరి జోడి కుదరడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: