టాలీవుడ్ క్రియేటివ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో సుకుమార్ ప్రతి పాత్రని చాలా స్పెషల్ కేర్ తీసుకొని మరీ డిజైన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బన్ని ని ఒక లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో చూపించబోతున్నాడు.ఇక రష్మిక మందన కూడా పూర్తి   డీగ్లామరస్ గా కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ హీరో అయిన సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా సునీల్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమాలో సునీల్ మంగళం శ్రీను అనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన సునీల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా సునీల్ మంచి పేరు తెచ్చుకుంటాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సునీల్ పాత్రకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించడానికి సునీల్ భారీ రెమ్యూనరేషన్  తీసుకున్నాడట. మంగళం సీను పాత్రకోసం సునీల్ దాదాపు 80 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

 దీంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సునీల్ రెమ్యూనరేషన్ ను బట్టి సినిమాలో అతని పాత్ర చాలా కీలకంగా మారుతుందని అర్థమవుతోంది.ఇక సునీల్ భార్య పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటించనుంది. గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. దీంతో ఈమెకు సుకుమార్ మరోసారి పుష్ప లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. మలయాళ అగ్ర నటుడు ఫాహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: