నందమూరి అభిమానులకు బాలయ్య 'అఖండ' సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల అవుతుందని అభిమానులు భావిస్తున్నా.. అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఫాన్స్ కి సైతం అర్థం కావడం లేదు. అయితే ఇటీవలే 'అఖండ' సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ జరిగింది. కాబట్టి సినిమా ఎప్పుడు విడుదల చేసినా కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆంధ్రాలో అఖండ సినిమా హక్కులు ఏకంగా 35 కోట్లకు అమ్ముడుపోయాయి.

 అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బయ్యర్లు మాత్రం ఆ రేటుకి గిట్టుబాటు కాదని చెబుతున్నారట. ఆ రేటులో కనీసం 25% తగ్గించమని నిర్మాతను కోరుతున్నారు. అయితే భారీ బడ్జెట్తో అఖండ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఇందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదని సమాచారం. ఓవైపు ఆంధ్రా హక్కులను తగ్గిస్తే మరోవైపు సీడెడ్ హక్కులు కూడా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీటింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు పూర్తయితే మాత్రమే అఖండ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే అఖండ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేకపోతున్నారు దర్శకనిర్మాతలు.

 ఇక ఇప్పటికే అఖండ నుంచి విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మరోవైపు బాలయ్యకు ఇటీవలే సర్జరీ చేయడంతో ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత గోపీచంద్ మలినేని సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నాడు బాలయ్య. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోసారి ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: