బాలీవుడ్ బాద్ షా గత కొన్ని రోజు లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డ్రాక్స్ కేసులో అరెస్ట్ అవ్వడం మరియు కోర్టుల చుట్టూ తిరగడం ఇలా అనేక సమస్యల వల్ల షారుఖ్ ఖాన్ సినిమాలకు కూడా దూరం అయ్యాడు. ఇక తాజా గా కొన్ని రోజుల క్రితమే ఆర్యన్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా కొడుకు ఇంటికి తిరిగి రావడంతో తో షారుక్ ఖాన్ కూడా తన సినిమా షూటింగ్ లను తిరిగి ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో లయన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అయితే డేట్స్ ప్రాబ్లం వల్ల నయనతారసినిమా నుండి తప్పుకుంది అని అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి.

 అయితే అలా బయటకు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. నయనతారసినిమా నుండి తప్పుకోలేదు అని ఇప్పటికే ఒత్తిడి లో ఉన్న షారుక్ ఖాన్ ను మరింత ఒత్తిడి పెట్టేందుకు ఒక వర్గం చేస్తున్నా అనవసరపు ప్రచారమే ఇది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ హీరో గా తెరకెక్కబోయే ఈ సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ సినిమా లో నయనతార ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా లో షారుక్ ఖాన్ కూడా తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి- సన్యా మల్హోత్రా తదితరులు ఈ సినిమా లో ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: