తెలుగు టీవీ రంగంలో తనదైన ముద్ర వేసిని శ్రీముఖి పలు సక్సెస్ ప్రోగ్రాములు చేస్తూ దూసుకుపోతూ ఉంది. ఇప్పుడు యాంకర్ శ్రీముఖి అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు వుండరు. శ్రీ ముఖి గ్లామర్ ఆమెకు గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆమెలో ఉన్న స్పాంటినీటి ఆమెకు కలిసొచ్చే విషయం. యాంకర్ రవి , యాంకర్ ప్రదీప్ , యాంకర్ సుమ వంటి వారితోనే పోటాపోటీగా వ్యాఖ్యానించగల సత్తా ఆమెకు ఉంది. శ్రీముఖి కుటుంబం తెలుగు వారు కానప్పటికీ ఆమె తెలుగు లో మాట్లేడేవిధానం చాల ముచ్చటగా ఉంటుంది.    




IHGశ్రీముఖి తండ్రి ఒక రాం కిషన్ నిజామాబాద్ లోని ఓ  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి. ఆమె తల్లి లత ఒక బ్యుటీషియన్. శ్రీముఖి ఇలాఖా మొత్తం డాక్టర్స్ ఉండటం తో రాం కిషన్ శ్రీముఖిని కూడా డాక్టర్ ని చేద్దాం అనుకుని పదవతరగతిలో 95 % మార్కులతో పాసైన శ్రీముఖిని బైపీసీలో చేర్చాడు. ఇంటర్ లో కూడా ఆమె 90% మార్కులు తెచ్చుకుని ఎంసెట్ ట్రై చేసింది కానీ ఆమెకు వచ్చిన ర్యాంక్ కారణంగా ఆమెకు డాక్టర్ సీటు దక్కలేదు. అయితే ఆమెకు బీడీఎస్ లో సీటు వచ్చింది. అయితే ఆ కోర్స్ చదువుతుండగానే ఆమెకు టీవీ వ్యాఖ్యాతగా అవకాశాలు రావడంతో చదువుకు చరమగీతం పాడింది. వెంటనే ప్రదీప్ పక్కన యాంకర్ గా అదుర్స్ ప్రోగ్రాం లో ఛాన్స్ కొట్టేసింది. ఆ ప్రోగ్రాం మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.



 దానితరువాత సూపర్ సింగర్ 9 కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.  యాంకర్ గానే కాకుండా తన గ్లామర్ తో  అభిమానులను సొంతం చేసుకుంది.  ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన 'జులై' సినిమాలో అవకాశం ఆమెను వరించింది. ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.   ఆమె అంటించిన సినిమాలు  జులాయి,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, ఎట్టుదిక్కుం మధయానై, చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, నేను శైలజ, సావిత్రి, జెంటిల్_మేన్, మనలో ఒకడు, బాబు బాగా బిజి, కుటుంబ కథ చిత్రమ్.
IHG



ఈటీవీలో ఫిబ్రవరి 7, 2013 న మొదలైన జబర్దస్త్ ప్రోగ్రాం యాంకర్ అనసూయ గ్లామర్ , కంటెస్టెంట్ ల కామెడీ లతో ప్రోగ్రాం మంచి రేటింగ్ సంపాదించుకుంది. అయితే కొన్ని కారణాలవల్ల యాంకర్ అనసూయ ప్రోగ్రాం నుండి తప్పుకుంది. అయితే ఆ తరువాత జబర్దస్త్ కోసం  యాంకర్ గా శ్రీముఖిని సంప్రదించారు మల్లెమాల మ్యానేజ్మెంట్. కానీ అందుకు శ్రీముఖి నో చెప్పింది. ఎందుకంటె అప్పటికే యాంకర్ అనసూయ పై వ్యక్తిగత విషయాలపై కామెడీ చేస్తూవుండడంతో ఆమె ఆ షో నుండి తప్పుకుంది. ఆ విషయం తెలుసుకున్న శ్రీముఖి ఆ అవకాశాన్ని తృణీకరించింది.





 నిజానికి ఆమెకు తన వ్యక్తిగత విషయాలపై కామెడీ చేయడం ఆమెకు  ఇష్టం ఉండదట. ఆ కారణంగా నే ఆమె ఆ అవకాశాన్ని వదులుకుంది. ఆ తరువాత జబర్దస్త్ ప్రోగ్రాం మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఒకంత ఫీల్ కూడా అయ్యిందట. అనుకోకుండా ఈటీవీ మల్లెమాల టీమ్ తరుపున వచ్చిన పటాస్ ప్రోగ్రాం లో యాంకర్ రవి పక్కన యాంకరింగ్ చేసే అవకాశం రావడంతో ఈ సారి ఈ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక వెంటనే ఒప్పేసుకుందట.ఈ ప్రోగ్రాం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తరువాత బిగ్ బాస్ లో కూడా వెళ్లి తనదైన ముద్ర వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: