మన తెలుగు సినిమా పరిశ్రమలో సోషల్ మీడియాలో కొంతమంది యాంకర్లు హడావుడి ఎక్కువగా చేస్తుంటారు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం కొంతమంది యాంకర్లు విషయంలో కొంత మంది అగ్ర దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తూ వారిని తమ సినిమాల్లో తీసుకుంటున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగు లో ఎక్కువగా సినిమాలు చేస్తూ యాంకర్లలో ముందు వరుసలో ఉంది అనే మాట వాస్తవం. ఇక ఆమె తర్వాత మరొకరు కూడా నటించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. అనసూయ తర్వాత రష్మీ ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో నాలుగు సినిమాలలో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

అయితే రష్మీ సినిమాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ కొంతమంది అడిగినా సరే ఇవ్వడం లేదని సమాచారం. దానికి ప్రధాన కారణం గతంలో ఆమె నటించిన సినిమాలన్నీ విఫలం కావడమే అనేది కూడా ఎక్కువగా వినబడుతున్న మాట. ప్రస్తుతం కొన్ని టీవీ ఛానెల్స్  కు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ అప్పుడప్పుడు సినిమాల్లో కనబడే ప్రయత్నం చేస్తుంది. అయితే సినిమాలో ఆమెకు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో సినిమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంతగా ఇష్టపడటం లేదని అంటున్నారు.

కొంతమంది దర్శకులు సంప్రదించిన తనకు సినిమాల్లో కలిసి రాలేదనే కాబట్టి దాన్ని టీవీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతారు అని వత్తిడి చేయవద్దని కూడా ఆమె చెప్పినట్లు సమాచారం. దీంతో ముందు అడిగిన వాళ్ళు కూడా తర్వాత ఆమె విషయంలో కాస్త వెనకడుగు వేశారని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినబడుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే ఆమె సినిమాను చేస్తుందా లేక టీవీ కార్యక్రమాలకు పరిమితమవుతున్నదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమెకు టీవీ యాంకర్ గా భారీ రెమ్యునరేషన్ కూడా కొన్ని ఛానెల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: