నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రైతు గా, అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన ప్రోమో లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలు కూడా పెంచేశాయి.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం రెండు లిరికల్ పాటలను బయటకు వదలగా వీటికి కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అఖండ సినిమా ట్రైలర్ ను నవంబర్ 15 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు, టీజర్ లు, పాటలతో ఈ సినిమా పై అంచనాలు పెంచేసిన అఖండ చిత్ర బృందం ట్రైలర్ తో ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచగలరో తెలియాలంటే ఈ సినిమా ట్రైలర్ విడుదల వరకు వేచి చూడాల్సిందే. అఖండ సినిమా షూటింగ్  పూర్తి చేసిన బాలకృష్ణ మరి కొద్ది రోజుల్లో గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: