బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టి, హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మీ. బుల్లితెర అయినా, వెండి తెర అయినా కూడా గ్లామర్ ను ఒలకబోయడానికి ఏమాత్రం వెనకాడని ఈ బ్యూటీ ఎందుకో వెనుకబడి పోయింది. ఆ వెనుకే వచ్చిన అనసూయ మాత్రం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. కానీ రష్మీని మాత్రం ఇంత వరకూ అదృష్టం వరించలేదు. టాలీవుడ్ లోని హైయెస్ట్ పెయిడ్ యాంకర్లలో ఒకరిగా నిలిచిన రష్మీకి వెండి తెరపై తారలా దూసుకు వెళ్లాలన్న కోరిక మాత్రం అలాగే ఉండి పోయింది. ప్రస్తుతానికి టెలివిజన్ షోలతోనే నెట్టుకు వస్తోంది ఈ భామ.

అయితే ఇంత గ్లామర్ ఒలకపోసినా ఆఫర్లు రాకపోవడానికి గల కారణమేంటా ? అంటే... రష్మీకి వస్తున్న ఆఫర్లు అంతంత మాత్రం. అందులోనూ కేవలం గ్లామర్ కే ప్రాధాన్యత. నటనకు అవకాశం ఉండదు. గతంలో ఆమె చేసిన అలాంటి సినిమాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. అయితే సోదరిగా లేదా ఏదైనా ఇతర పాత్రలు వస్తే రష్మీ రిజెక్ట్ చేసేదని టాక్ కూడా ఉంది. ఇలా హీరోయిన్ గా మాత్రమే చేస్తానని మొండి పట్టు పట్టుకు కూర్చుంటే వచ్చిన ఆ కొన్ని అవకాశాలు కూడా చేజారిపోతాయి. అనసూయ మాత్రం అదృష్టం గురించి ఆలోచించకుండా వచ్చిన అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంది. అందుకే ఈరోజు ఆమె దూసుకెళ్తోంది.

మరోవైపు సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం అంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇది మాత్రమేనా ఆమెలో దాతృత్వ యాంగిల్ కూడా ఉంది. ఆమెలోని దయా గుణం అందరినీ ఫిదా చేస్తుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల రష్మీ చూపే ప్రేమ అద్భుతం. లాక్ డౌన్ సమయంలో అందరూ నోరున్న మనుషులే ఆకలితో మారుతున్నారని సహాయం చేశారు. కానీ నోరు లేని జీవాల మాటేమిటి? అవి చెప్పలేవుగా ఆకలేస్తే... ఆకలితో మలమల మాడిపోతున్న మూగ జీవాలకు తన వంతు సాయం అందించింది రష్మీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: