తెలుగు తెరపై బిగ్బాస్ కార్యక్రమం ఎంతో గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సీజన్ ఎన్టీఆర్ పోస్టింగ్ చేయగా.. ఈ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నాని హోస్టింగ్ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున అవతారమెత్తాడు అన్న విషయం  తెలిసిందే. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల నుంచి తన హోస్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాడు. కాగా ఇటీవలే నాగార్జున పోస్టింగ్ లో  లో బిగ్ బాస్ 5వ సీజన్ కూడా ప్రారంభమైంది. ప్రారంభం కావడమే కాదు ఏకంగా 70 రోజులు పూర్తి చేసుకోబోతోంది.



 అయితే గత సీజన్లో తో పోల్చి చూస్తే బిగ్ బాస్ హౌస్ లో అంతలా ఎంటర్టైన్మెంట్ రావడం లేదు అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. ఇక ఈ సారి బిగ్బాస్ అందరిని బాగా అలరిస్తుంది అంటున్నారు మరికొంతమందిప్రేక్షకులు. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఎలిమినేషన్ కూడా ఎంతో హాట్ హాట్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన టాస్క్ కాస్త అటు బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అని చెప్పాలి. బీబీ హోటల్ అంటూ బిగ్ బాస్ ఒక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. అయితే బీపీ హోటల్లో శ్రీరామ్ షణ్ముఖ్ వెయిటర్స్ లా గా ఉంటారు. ఇక అనీ మాస్టర్ హోటల్ మేనేజర్ గా ఉంటుంది. రవి హౌస్ కీపింగ్, సన్నీ తొలిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన అతిథి, సిరి ఒక డాన్ కూతురు, ఇక బిగ్బాస్ ప్రేమ పావురాలు గా ఉన్నా మానస్ ప్రియాంక హనీమూన్ కి వచ్చిన కొత్త జంట గా ఉంటారు.



 అయితే ఇక బీబీ హోటల్ టాస్క్ లో భాగంగా కంటస్టెంట్స్ మధ్య జరుగుతున్న సంభాషణలు అటు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే టాస్క్ లో హోటల్ సిబ్బంది అతిథులు నుంచి 15 వేల రూపాయలు గెలిస్తే వారు కెప్టెన్సీ పోటీదారులు గా నిలుస్తారు. అయితే ఈ టాస్క్ లో సన్నీ తన కామెడీతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పావురాలు గా ఉన్న మానస్ ప్రియాంక రొమాంటిక్ యాక్షన్తో కేక పుట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: