ఆ తర్వాత ఎన్ సి సి లో చేరిన సమయంలో బీహార్ కు చెందిన శశాంక్ భరద్వాజ్ ప్రేమలో పడింది. మొదట్లో వీరి ప్రేమను ఇంట్లో అంగీకరించలేదు. చదువు పూర్తి చేసుకుని హెచ్ ఆర్ గా, సాక్షి లో న్యూస్ రీడర్ గా కూడా పనిచేసింది. అంతేకాదు ఈ ఛానల్ లో ఉన్నప్పుడే ఆర్ జి వి తో ఓ టాక్ షో కూడా చేసింది. అనంతరం మా మ్యూజిక్ లో విజే గా కూడా పనిచేశారు అనసూయ. ఆ తర్వాత ఇంట్లో గట్టిగా మాట్లాడి ఒప్పించి భరద్వాజ్ ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఈ కుందనపు బొమ్మ. అలా ఈ షోతో ఎవరు ఊహించని స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మొదట ఎనిమిదివేల పారితోషికాన్ని పుచ్చుకున్న ఈ అందాల తార ఆ తర్వాత షో బాగా హిట్ అవ్వడం తో నాకు ఎపిసోడ్ కి 25 వేలు ఇస్తేనే చేస్తాను..నా వలనే షో హిట్ అయింది అని డిమాండ్ చేయడంతో ఆ ప్లేస్ లోకి రేష్మి ని తీసుకున్నారు.
అనసూయ మాత్రం బిందాస్, మోడ్రన్ మహాలక్ష్మి వంటి పలు షోలు చేసిన జబర్దస్త్ వచ్చినంత పాపులారిటీ రాలేదు. మళ్ళీ 2015 అక్టోబర్ 17 న జబర్దస్త్ లో ఛాన్స్ రావడంతో కాదనుకుండా యాంకర్ గా వచ్చేశారు అనసూయ. దాంతో మళ్ళీ కెరియర్ లో దూకుడు పెంచారు అనసూయ. రంగస్థలం, జాక్పాట్, డ్రామా జూనియర్స్ వంటి పెద్ద షోలలో అవకాశాలు అందుకుని జోరు పెంచారు. జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపు తోనే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయనడంలో సందేహం లేదు. అనసూయ అందం, అభినయం వాక్చాతుర్యం ఇలా అన్ని పుష్కలంగా ఉండటం తో వెండితెరపై కూడా మంచి ఛాన్స్ లను అందుకుంటున్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నారు అను. ప్రస్తుతం పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటిస్తున్నారు.