నటసింహం బాలయ్య సినిమా వస్తుంది అంటే నందమూరి ఫ్యాన్స్ లో ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల కొన్నాళ్లుగా ఆయనకు ఆశించిన స్థాయి విజయం అయితే దక్కడం లేదనే చెప్పాలి. ఇక దానితో ప్రస్తుతం తనకు ఎంతో కలిసి వచ్చిన దర్శకుడైన బోయపాటి శ్రీను తో అఖండ సినిమా చేస్తున్నారు బాలయ్య. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తీస్తున్న ఈ సినిమా పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే రెండు టీజర్స్, రెండు సాంగ్స్ రిలీజ్ అయిన ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానున్నట్లు టాక్. అయితే దీని తరువాత మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తో నెక్స్ట్ సినిమా చేయనున్నారు బాలయ్య. ఈనెల 13న అధికారికంగా లాంచ్ కానున్న ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ గా కనిపించనుండగా ఆయనకు జోడీగా యువ భామ శృతి హాసన్ నటించనుంది. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాని గ్రాండ్ లెవెల్లో ఆరంభించి భారీ స్థాయిలో చిత్రీకరించనుందట యూనిట్.
అందుతున్న సమాచారం ప్రకారం పక్కా మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ఇందులో శృతి తో పాటు మరొక హీరోయిన్ గా నివేతా థామస్ కూడా యాక్ట్ చేయనుందని లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ సినిమాలో ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని, కాగా ఆ పాత్ర కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన యూనిట్, ఫైనల్ గా నివేతా థామస్ ని ఎంపిక చేసారని, ఆ వివరాలు ప్రారంభోత్సవం రోజున అనౌన్స్ చేస్తారని సమాచారం. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కనున్న ఈ సినిమా తప్పకుండా రిలీజ్ తరువాత సూపర్ హిట్ హిట్ కొట్టడం ఖాయం అంటూ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: