స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం నటించిన సినిమా అలవైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు దీనిని నిర్మించాయి, అలానే థమన్ సంగీతం అందించారు. విడుదల తరువాత అత్యద్భుత విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతో పాపులర్ అయి హీరోగా అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టాయి.

ఇక ఆ సూపర్ సక్సెస్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ భారీ మాస్ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందున్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీస్తుండగా ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, మూడు సాంగ్స్ అందరి నుండి మంచి స్పందన అందుకున్నాయి. కాగా ఫస్ట్ పార్ట్ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు ఇటీవల పుష్ప యూనిట్ ప్రకటించింది.

ఐతే లేటెస్ట్ గా రెండు రోజులుగా ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం పుష్ప మరికొద్దిరోజుల పాటు వాయిదా పడనుందని, సినిమాని వారం వాయిదా వేసి డిసెంబర్ 24న విడుదల చేసేలా యూనిట్ ఆలోచన చేస్తోందని టాక్. ఐతే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారికంగా పుష్ప మూవీ యూనిట్ నుండి ప్రకటన వస్తేనే కానీ దీనిని విశ్వసించలేం అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. మరి అల్లు అర్జున్ తొలిసారిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు పాటు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: