టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట ఇటీవల బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు ఆర్ధిక నేరాల నేపథ్యంలో మంచి యాక్షన్ తో కూడిన మాస్ మూవీగా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా రాక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ ఈ సినిమా కోసం ఇప్పటికే ఫుల్ గా తన స్టైల్ ని మార్చి క్రాఫ్ పెంచడంతో పాటు మరింత స్టైలిష్ గా సిద్ధం అయ్యారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవల మహేష్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఫస్ట్ టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల సర్కారు వారి పాట యూనిట్ ప్రకటించింది. కాగా అందరిలో భారీగా అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలకు ఒక సమస్య పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా కొద్దిరోజులగా సర్కారు వారి పాట షూటింగ్ కి సంబంధించి పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండడంతో వాటిని యూనిట్ అదుపు చేయలేకపోతోంది.

నిజానికి యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా లీక్స్ మాత్రం ఆగడం లేదని, అందుకే ఇకపై నిర్మాతలు ఈ విషయమై మరింత గట్టిగా జాగ్రత్తగా చర్యలు చేపట్టి ఎటువంటి లీక్స్ బయటకు రాకుండా చూసుకోనున్నారని అంటున్నారు. మరి రిలీజ్ తరువాత సర్కారు వారి పాట ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక ఆరు నెలల వరకు ఆగాల్సిందే. కోలీవుడ్ నటుడు సముద్రఖని మెయిన్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: