అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ తెలుగు నాట అనేక సినిమా లలో నటించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక దశలో టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి తెలుగు టాప్ హీరోయిన్ స్థానానికి కూడా శృతి హాసన్ ఎదిగింది. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం, హిందీ భాషలలో కూడా అనేక సినిమాలలో నటించిన శృతి హాసన్ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే నేను రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. ఇలాంటి క్రమంలో ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉందన్నది నేను నేర్చుకున్న గొప్ప పాఠం అని శృతి హాసన్ అన్నారు. శృతి హాసన్ ఇంకా మరి కొన్ని విషయాలను మాట్లాడుతూ... నీకు అన్నీ తెలుసు అనుకున్న రోజు వీడియో గేమ్‌ లా నీ లెవల్‌ ఒకటికి వస్తుంది అని... అందు కోసమే అహాన్ని తగ్గింపు చేసుకొని, లెవెల్ లో పెంచుకోవడం చేసుకోవాలి. ఏదో బోధించాలి అని మాత్రం కాదు. చెప్పాలి అనిపించిన విషయాన్ని చెప్పాను అని శృతి హాసన్ అన్నారు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ , ప్రభాస్ హీరో గా కేజిఎఫ్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడుగా క్రేజ్ తెచ్చుకున్న  ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా శృతిహాసన్ క్రేజి సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: