తెలుగు టెలివిజన్ లో ఎన్నో షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కొన్ని షోలు మాత్రమే ప్రేక్షకుల మనసును గెలుచుకుని అలా చిరకాలం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా సంగీతం, పాటల షో వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అందులో వచ్చే గాయని గాయకులు వారి వారి ప్రతిభను బట్టి పాపులర్ అవుతూ ఉంటారు. అలా
మా టీవిలో ప్రసారమైన సూపర్ సింగర్స్ అనే సింగింగ్ షోతో ప్రేక్షకుల హృదయాలను తన స్వర మాధుర్యంతో గెలుచుకున్నారు సింగర్ హేమ చంద్ర. ఎందరో సంగీత కళాకారులు మట్టిలో మాణిక్యాల్లా ఇండస్ట్రీకి దొరికారు. అలనాటి వారిలో హేమ చంద్ర కూడా ఒకరనే చెప్పాలి. ఆ షోలో పార్టిసిపేట్ చేసిన  దాదాపు అందరూ కంటెస్టెంట్స్ కూడా గొప్ప గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో పాటలు పాడే అవకాశం పొందటం విశేషం.


శ్రావణ భార్గవి, గీతా మాధురి,  కృష్ణ చైతన్య ఇలా వీరందరు కూడా ఆ షోతో క్రేజ్ పెంచుకున్న వారే. హేమచంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇతడు ఒక ఫేమస్ గాయకుడు మరియు సంగీత దర్శకుడు కూడా, హైదరాబాద్ లోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదాల హేమచంద్ర  చిన్న తనం నుండే సంగీతంలో శిక్షణ పొందాడు. ప్రముఖ టాలివుడ్ సింగర్ ఎన్.సి. కారుణ్య ఇతడికి దగ్గరి బంధువు. పలు టివి సింగింగ్ షోస్, మరియు స్టేజ్ షో లతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తన అధ్బుతమైన తన స్వరాన్ని ఈ ప్రపంచం గుర్తించేలా చేసి సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. ఇందులో సూపర్ సింగర్ షో అతడికి బాగా పేరు తెచ్చిందనే చెప్పాలి.

 ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకరిగా ఉన్న హేమ చంద్ర సినిమాల్లో మొదట పాడిన పాట మణిశర్మ సంగీతం అందించిన లక్ష్యం చిత్రంలోని "నిలువవే..." అనే పాట. ఈ పాటకు అతడి స్వరం బాగా ప్లస్ అయ్యింది. మంచి హిట్ ను అందుకుని పాపులారిటీ పెరిగింది.  బిల్లా సినిమాలో ఇతడు పాడిన బొమ్మాళి పాట,  పరుగు చిత్రంలో "హృదయం ఓర్చుకొలేనిది గాయం"  వంటి పాటలు ఎన్నో  హేమచంద్ర సినీ కెరియర్ లో ఆణిముత్యాలనే చెప్పాలి. తాజాగా జక్కన్న మరో సంచలనాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో దోస్తీ అనే పాటను హేమచంద్ర పాడారు. ఈ పాట విడుదలయి ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే.  ఇలా తన కెరియర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక హేమచంద్ర వ్యక్తిగత జీవితానికి వస్తే...సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రావణ భార్గవి ని ఇతను ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం విదితమే. 2013 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున వీరి వివాహం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్యాహ్నం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: