యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో లో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనేక కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది, ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ లు జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే  మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి, ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రేమ కథ సినిమా కోసం చిత్ర నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు పెట్టి ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

 ఇలా భారీ ఖర్చుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.  'ఈ రాతలే' అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను 15.11.2021 సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే ఈ లిరికల్ సాంగ్ విడుదల కాబోతుంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన ఈ సాంగ్ ను మరో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. గాయని హరిణి ఇవటూరి తో కలిసి ఆలపించారు. ఇలా రాధే శ్యామ్ చిత్ర బృందం మొదటి సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. రాదే శ్యామ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా చిత్ర బృందం బయటకు వదిలిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి నీటిలో కారులో ప్రయాణిస్తున్నట్లు గా ఉంది. ఇలా పోస్టర్లతో కూడా ఈ సినిమాపై చిత్ర బృందం అంచనాలను పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: