సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో  మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, కీర్తి సురేష్ మొట్ట మొదటి సారి మహేష్ బాబు సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కథ బ్యాంకింగ్ రంగం లో జరిగే అతి పెద్ద కుంభ కోణం చుట్టూ తిరగబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం బయటికి వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి.

సినిమా ను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుక గా జనవరి 13 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఆ తర్వాత ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ విడుదలను వాయిదా వేసి ఏప్రిల్ 1 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక దర్శకుడు పరశురామ్ కూడా ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. సర్కారు వారి పాట సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి అని తెలుస్తోంది. ఒక ప్రముఖ సంస్థ సర్కారు వారి పాట సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 15 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమా కు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: