టాలీవుడ్ నటుడు బాలయ్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతో గ్రాండ్ గా తీస్తుండగా యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దీనిని భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కంచె మూవీ ఫేమ్ ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా సి రామ్ ప్రసాద్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే బాలయ్య రెండు లుక్స్ తాలూకు టీజర్స్, అలానే రెండు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకోవడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.
నందమూరి అభిమానులతో పాటు అందరూ ఆడియన్స్ ని అలరించేలా బోయపాటి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. అయితే ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు రాత్రి 7 గం. 9 ని.లకు విడుదల చేయనున్నట్లు యూనిట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. అందుతున్న ఇన్నర్ వర్గాల న్యూస్ ప్రకారం ట్రైలర్ ఎంతో అద్భుతంగా వచ్చిందని, ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అని, అలానే ముఖ్యంగా రేపు సినిమా రిలీజ్ తరువాత అఖండ ద్వారా బాలయ్య బాక్సాఫీస్ పై గర్జించి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని సమాచారం.
కాగా ఈ సినిమాని డిసెంబర్ మొదటి వారం లో విడుదల చేయనుండగా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కూడా రేపు వెల్లడయ్యే అవకాశం కనపడుతోంది. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ అఖండ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఆగాలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: