టాలీవుడ్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా.. సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ల లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇక ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి రేపటి నుంచి స్టోరీ సిట్టింగ్స్ జరగబోతున్న ట్లు సమాచారం. ఇక ఈ సిట్టింగ్స్ లో రచయితలైన శ్రీధర్ సీపాన, మచ్చ రవి తో పాటుగా సీనియర్ రచయిత సత్యానంద్ కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కథ ఫైనల్ అయ్యాక ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ జరగనున్నాయి. ఈ సినిమాకు తమిళ అగ్ర సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే ఎన్టీఆర్ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

 అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చొరవతో నే ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విలన్ కి రైట్ హ్యాండ్ పాత్రలో కమెడియన్ సునీల్ మరో ప్రత్యేకమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో దాదాపు మూడు వేరియేషన్స్ లో ఎన్టీఆర్ కనిపిస్తారట. ఇక తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 22 న సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: