అందాల తార రాశిఖన్నా "ఊహలు గుసగుస లాడే" సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉంటి తనకు సంబంధిచిన లేటెస్ట్ ఫోటో షూట్ లను, విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తెలుగులో మొదటి సినిమాతోనే తన నటనతో మరియు మతి పోగొట్టే అందంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈ భామ...కాస్త బొద్దుగా ఉన్నా చాలా క్యూట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది. మరి ఇపుడేమో సన్నజాజి తీగలా నాజూగ్గా తయారయి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అసలు ఈమె తొలుత బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత కోలీవుడ్ లోనూ మంచి అవకాశాలను అందుకుంటూ తన హవా చాటింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చేస్తున్న "థ్యాంక్యూ" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మనం సినిమా డైరెక్టర్ విక్రమ్‌ కె. కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.  అయితే తాజాగా ఈ హీరోయిన్ కి సంబందించిన ఓ వార్త అభిమానుల్ని ఎంతగానో బాధపెడుతోంది. రాశిఖన్నా కూడా తాప్సీ బాటలోనే నడవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇకపై బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్ అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.

దీని వెనుక కారణం ఏమిటా అని ఆరాతీస్తే అక్కడ ఛాన్స్ లు కూడా ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ముంబై కి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఆమె ఫ్యాన్స్ కి మాత్రం ఇది పెద్ద షాక్ ఇస్తోంది.  ఇప్పటికే అక్కడ సెటిల్ అయిన తాప్సి వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఉంది. మరి రాశిఖన్నా ప్లాన్ ఏమిటో అన్నది తెలియాలంటే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: