సూపర్ స్టార్ మహేష్ తో యువ దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన బ్లాక్ బస్టర్ సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. విజయశాంతి ఒక కీలక పాత్ర చేసిన ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అయితే దాని తరువాత ప్రస్తుతం పరశురామ్ తో చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

అయితే దీని తరువాత ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక సినిమా కమిట్ అయ్యారు మహేష్ బాబు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాని డిసెంబర్ లో ఆరంభించి వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. అయితే దీని అనంతరం తొలిసారిగా రాజమౌళి తో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మాతగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బానర్ పై ఎంతో భారీ ఎత్తున రూపొందనున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ పై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేయడం ప్రారంభించారని, త్వరలో కథ సెట్ అయిన అనంతరం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ మరికొన్నాళ్లు పాటు వాయిదా పడినట్లు చెప్తున్నారు.

నిజానికి ప్రస్తుతం తన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ పబ్లిసిటీ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి దానిని పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుందని, అలానే ఆ తరువాత రాజమౌళి కెరీర్ పరంగా కొంత విరామం తీసుకున్న అనంతరం మహేష్ సినిమా మొదలెట్టనున్నారని అంటున్నారు. అయితే ఈ లోపు మహేష్ బాబు, మరొకసారి యువ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసారని, దీనితో ఒకరకంగా మరికొన్నాళ్లు పాటు రాజమౌళి సినిమా వాయిదా పడ్డట్లే అంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే పూర్తిగా అధికారిక వివరాలు బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: