మెహర్ రమేష్ 2004 లో హీరో పునీత్ నటించిన "వీర కన్నడిగా" అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టాడు మెహర్ రమేష్. కానీ టాలీవుడ్ లోకి మాత్రం మెహర్ రమేష్"బిల్లా, షాడో, కంత్రి వంటి సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలన్నీ యావరేజ్ గా ఆడాయి. అప్పట్లో ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి మన హీరోలు సైతం బాగా ఆసక్తి చూపించేవారు.
ఇక ఎన్టీఆర్ తో కలిసి డైరెక్షన్ చేసిన శక్తి సినిమా మాత్రం బారి అట్టర్ ఫ్లాప్ ను చవి చూసింది.దీంతో సినీ ఇండస్ట్రీలో మెహర్ రమేష్ తో సినిమా అంటే భయపడేవారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మెహర్ రమేష్ మహేష్ బాబు సినిమా ఎందుకు ఆగిపోయింది అనే వార్త ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. మహేష్ బాబుకు కథ వినిపించినప్పుడు నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పాడట కానీ శక్తి సినిమా రిజల్ట్ చూసిన తర్వాత.. మహేష్ బాబు ఆ సినిమాని వదులుకున్నట్టు గా సమాచారం.
అయితే అదే కథను వేరొక హీరోకి చెప్పిన కూడా అతను కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక మెహర్ రమేష్ సిలువ తీయాలని చూస్తున్నప్పటికీ ఎవరు ఒప్పుకోవడం లేదు. అలాంటి ఆయనకు ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తగిలింది. చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఈయన కెరీర్ మారిపోతుంది.