హాట్ బ్యూటీ శృతి హాసన్ , రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన బలుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సారి శృతి హాసన్, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన బలుపు  సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బలుపు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఇలా వీరిద్దరి కాంబినేషన్ లోనే గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాను తెరకెక్కించాడు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్ లలో సందడి చేసిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ అంశాలతో, పక్కా కమర్షియల్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలబడే మాత్రమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా దర్శకుడు గోపీచంద్ మలినేని శృతి హాసన్ కు బలుపు, క్రాక్ సినిమా లతో రెండు సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందించాడు.

ఇలా ఇప్పటికే రెండు విజయాలను శృతి హాసన్ కు అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మరొక సారి తాను తదుపరి బాలకృష్ణ తో తెరకెక్కించబోయే సినిమా లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా ఎంచుకున్నాడు.     ఎన్ బి కె 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈ మధ్య పూర్తి అయ్యాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమా లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే పవర్ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్న గోపిచంద్ మలినేని అదే రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే శృతి హాసన్ కు రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో తెరకెక్కించబోయే సినిమాతో కూడా శృతి హాసన్ కు అదే రేంజ్ హిట్ అందిస్తాడో లేదో తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: