రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామి సృష్టించింది. దాంతో నేషనల్ వైడ్ గా ప్రభాస్ రేంజే మారిపోయింది.ఇక బాహుబలి తర్వాత కూడా అదే హవా కంటిన్యూ చేస్తూ వచ్చాడు ప్రభాస్. ఇక బాహుబలి తర్వాత తన వరస ప్రాజెక్టులను పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలు విడుదలకు ముందే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.

రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్ సంస్ద ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం 78 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ ప్రభాస్ అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ టీజర్ ఏకంగా 42.67 మిలియన్ల న్యూస్ ను రాబట్టి టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూవుడ్ టీజర్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 493.5K లైకులను పొందింది.

ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే మొదటి 24 గంటల్లో అత్యధిక న్యూస్ సాధించిన టీజర్ల జాబితాలో 'రాధేశ్యామ్' టీజర్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక దీనికంటే ముందు మొదటి స్థానంలో కన్నడ హీరో యశ్ నటిస్తున్న 'కే జి ఎఫ్' చాప్టర్ 2 టీజర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక రాధేశ్యామ్ టీజర్ తో ఇండియా వైడ్ గా ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది అని చెప్పాలి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు సైతం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: