మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమా తో  రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు, ఇలా చిరంజీవి ఒక సినిమా తర్వాత ఒక ఒక సినిమాను చాలా కూల్ గా చేస్తూ వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి ఇలానే ఒక సినిమా పూర్తయిన తర్వాత  మరొక సినిమా పూర్తి చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా అనుకున్న వారి ఆలోచనలకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా లైన్ లో ఉండగానే మరి కొన్ని సినిమాలను సెట్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

 ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవిసినిమా తో పాటు మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్ లను శర వేగంగా పూర్తి చేస్తున్న చిరంజీవి తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ లో కూడా మరి కొన్ని రోజుల్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా తో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాలో చిరంజీవి నటించబోతున్నాడు, ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి ని ఫుల్ మాస్ రోల్ లో చూపించబోతున్నారు తెలుస్తోంది. సముద్రతీర ప్రాంతంలోని ఒక జాలరి గూడెం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు అఫీషియల్ గా చిత్ర బృందం టైటిల్ ను  ఫిక్స్ చేయక పోయినప్పటికీ వాల్తేర్ వీర్రాజు అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరి చిత్ర బృందం ఇదే టైటిల్ ను కన్ఫామ్ చేస్తోందో.? లేక వేరే ఏదైనా టైటిల్ ను ఈ సినిమాకు పెడతారో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: