బాలకృష్ణకి ఈమధ్య అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వయసులో కూడా ఒకవైపు బుల్లితెర, మరొక వైపు సినిమాలో యాక్టింగ్ చేస్తూ బాగా ప్రేక్షకులను ఆనంద పరుస్తున్నాడు బాలయ్య. వాస్తవానికి బాలకృష్ణకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమానే పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ లిస్ట్ లోనే వెళ్లిపోయాయి. అలాంటి సమయంలోనే బోయపాటి తో కలిసి ఒక సినిమా ప్రకటన విడుదల చేశారు. అదే అఖండ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా డైరెక్టర్ కొరటాల శివ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిన్నటి రోజున గోపీచంద్ మలినేని తో జై బాలయ్య అనే మూవీ తీయడానికి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు.. పక్కా మాస్ మసాలా సినిమాను తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకి హీరోయిన్ శృతిహాసన్ సెలెక్ట్ కావడం గమనార్హం. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అనిపించుకుంటుంది అని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరొక మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుందని సమాచారం.. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య  మూవీ తీయబోతున్నాడని సమాచారం. బాలయ్య 107 వ మూవీ ఓపెనింగ్ రోజున కొరటాల బాలయ్యతో చాలా క్లోజ్ గా గడిపాడు అని అందుకే సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య సినిమా తీసి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారు.. తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా తీయబోతున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యతో సినిమా వచ్చే అవకాశం ఉందట.

బాలయ్య పక్కన మాస్ సబ్జెక్ట్ మెసేజ్  సజెస్ట్ చేయడం తో కొరటాల శివ అదే కోణంలో తీయాలని చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: