గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. 14 రీల్స్, జీఎంబీ క్రియేషన్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు అధికారి గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ బాబు పోస్టర్స్, అలాగే ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లతోపాటు అదిరిపోయే కామెడీ కూడా ఉండబోతుందట. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అంతేకాదు అధికారికంగా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మహేష్ బాబు ఫాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ఇక మిగతా స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే సర్కారు వారి పాట సినిమా నుంచి అప్డేట్ లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా నుంచి త్వరలోనే మొదటి పాటని విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి మొదటి పాట ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల చేసి ఆ తర్వాతనే మిగతా పాటలు కూడా వెంట వెంటనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి మహేష్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను థమన్ అదిరిపోయే విధంగా కంపోజ్ చేసినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: