పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా, ధ్యానియేల్ శేఖర్ అనే పాత్ర చేస్తుండగా యువ భామలు సంయుక్తా మీనన్, అలానే నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్స్, అలానే మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి.

మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాని సాగర్ కె చంద్ర తీస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే దానికి వారం ముందు, అనగా జనవరి 7న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల కానుండడంతో భీమ్లా నాయక్ వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అయ్యాయి.

కాగా లేటెస్ట్ ఫిలిం నగర్ సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ సినిమా ముందుగా అనుకున్న విధంగానే జనవరి 12న పక్కాగా థియేటర్స్ లోకి వస్తుందని, అలానే సినిమా విడుదల విషయమై నిన్న డిస్ట్రిబ్యూటర్స్ తో ప్రత్యేకంగా మాట్లాడిన నిర్మాత నాగ వంశీ, పలు ఏరియాల్లో సినిమాకి సంబంధించి థియేటర్స్ బుకింగ్ కూడా ప్రారంభించమని చెప్పినట్లు టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే రాబోయే సంక్రాంతికి భీమ్లా పక్కాగా బరిలోకి దిగడం ఖాయంగా కనపడుతోంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: