టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం ఒక్కో సినిమాతో హీరోగా తన క్రేజ్, మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ పోతున్న నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి తీసిన బాహుబలి రెండు సినిమాలతో అమాంతం హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఆ తరువాత సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలు చేస్తుండగా వాటిలో ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతికి రాధాకృష్ణ తీస్తున్న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇక విషయం ఏమిటంటే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్  మొదటి వారంలో ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తొందట.

అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబై లో ఎంతో గ్రాండ్ గా జరగనుండగా బాలీవుడ్ కి చెందిన ముగ్గురు టాప్ స్టార్స్ దీనికి ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సినిమా యొక్క ప్రమోషన్స్ ప్రారంభించిన యూనిట్, త్వరలో మరిన్ని అప్ డేట్స్ ని ఫ్యాన్స్ ముందుకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇందులో ప్రభాస్ కి తల్లిగా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ప్రభాస్ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: