తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందాన గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. రష్మిక మందన తన అందంతో సొట్టబుగ్గలతో, క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో కుర్రకారులను మంత్రముగ్దులను చేస్తూ ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అంతేకాదు.. ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.

రష్మిక మందన తొలిసారిగా ఛలో, గీత గోవిందం సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఆకట్టుకుంది. అయితే ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరో తో కూడా నటించే అవకాశం అందుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా మిస్టర్ మజ్ను, అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాలలో కూడా నటించారు.

అయితే రష్మిక కన్నడ ఇండస్ట్రీలోకి 'కిరాక్ పార్టీ' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అక్కడ అంతగా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్ వైపు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. అంతేకాదు.. ఒక నెటిజన్ తన వివాహం గురించి అభిప్రాయం అడగగా.. రష్మిక మందన కొన్ని విషయాలను వెల్లడించారు.

ఈ సందర్బంగా రష్మిక మాట్లాడుతూ.. తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టమని.. తమిళ సంప్రదాయం, సంస్కృతి తనను ఎంతగానో ఆకర్షించింది అని తెలిపారు. ఇక ముఖ్యంగా అక్కడి వంటకాలు అంటే చాలా ఇష్టమని అన్నారు. రష్మిక ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే తన కోరిక అని తెలిపింది. కాగా.. నెటిజనులు ఈ విషయం తెలుసుకున్న తరువాత ఈమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: