సాయితేజ్‌ రోడ్డు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. యశోధ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన ఆయన ఇంట్లో కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్‌ నుంచి కంప్లీట్‌గా రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్‌ లెవల్స్‌ పెంచుకుంటున్నాడు. అయితే షూటింగులకి దూరమైనా సాయితేజ్ మాత్రం ఖాళీగా ఉండటం లేదు. ఈ గ్యాప్‌లో కొత్త సినిమాలకి కూడా సంతకాలు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

సాయితేజ్‌ యాక్సిడెంట్‌ అయినప్పటి నుంచి సినిమాలకి బ్రేక్ ఇచ్చి బాడీకి రెస్ట్ ఇచ్చాడు. రెండు నెలల క్రితం వినాయక చవితి నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజ్‌ కాలర్‌బోన్ దెబ్బతింది. ఆపరేషన్‌ తర్వాత కొన్నాళ్లు డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్న సుప్రీమ్‌ స్టార్ ఇటీవలే కోలుకున్నాడు. అలాగే ఈ గ్యాప్‌లో కొత్త కథలు కూడా వింటున్నాడట.

సాయితేజ్‌ నెక్ట్స్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే టాక్‌ వస్తోంది. రీసెంట్‌గానే తేజుకి మారుతి ఒక స్టోరీ నెరేట్‌ చేశాడని, ఈ కాన్సెప్ట్‌కి సుప్రీమ్‌ స్టార్‌ కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'ప్రతిరోజూ పండగే' సినిమా వచ్చింది. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు తేజు.

సాయితేజ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌కి ముందు కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే తేజు మళ్లీ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. ఇక ఫస్ట్ మూవీ పిల్లానువ్వులేని జీవితం రిలీజై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆడియన్స్‌కి స్పెషల్‌ థ్యాంక్స్ చెబుతూ జర్నీ వివరాలను అభిమానులతో పంచుకున్నాడు సాయి ధరమ్ తేజ్.


మొత్తానికి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ షాక్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇంట్లో ఉంటే సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. మరి సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో అప్పటిలా అదే చలాకీతనం చూపిస్తాడో లేదో చూడాలి. మెగా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: