సాధారణంగా ఒక సినిమా తెరకెక్కాలి అంటే ఎన్నో కసరత్తులు చేయాల్సిందే.. ముందుగా కథ రెడీ చేసి పెట్టుకున్న దర్శకుడు, నిర్మాత ను వెతుక్కోవాలి. ఆ తర్వాత దర్శక నిర్మాతలు ఇద్దరూ కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు..కథకు తగ్గట్టుగా హీరో ని ఎంచుకొని హీరో సరసన కథానాయిక ఎంపిక విషయంలో కూడా ఆడిషన్స్ చేసి, ఒక నిర్ణయానికి వస్తారు.. ఇలా ఎంచుకున్న హీరోయిన్లు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేస్తారు. అలా మొదటిసారి ఎంపికైన హీరోయిన్లు కొన్ని కారణాలవల్ల మిస్ చేసుకుంటూ ఉంటారు..ఇలా మంచి హిట్ ఇచ్చిన సినిమాలను మిస్ చేసుకున్న హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం.

శృతిహాసన్:
బిజినెస్ మాన్ సినిమా కి ముందుగా శృతిహాసన్ ను అనుకున్నారు.. కానీ చివరికి కాజల్ ఫైనల్ అయింది. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. పూరి జ‌గ‌న్నాథ్ ముందుగా శృతిని అనుకుని ఆ త‌ర్వాత హీరోయిన్ ను మార్చారు.

అనుష్క:
రెబల్ సినిమాకు తమన్నా పాత్రకు ముందుగా అనుష్కని అనుకున్నారు.. కానీ అనుష్క వద్దనడంతో తమన్నాను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమాలో త‌మ‌న్నా పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది.

అనుపమ పరమేశ్వరన్:
రంగస్థలం సినిమా కు దర్శకుడు సుకుమార్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు.. కానీ సమంత ఫైనల్ అయింది.

రకుల్ ప్రీత్ సింగ్:
గీత గోవిందం సినిమాలో రష్మిక మందన కు బదులుగా రకుల్ ప్రీతిసింగ్ ను అనుకున్నారు..కానీ రష్మిక మందన సెలెక్ట్ అవడం జరిగింది.

తమన్నా:
రాజుగారు గది త్రీ సినిమా కు తమన్నాను అనుకొని పూజాకార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.. కానీ అవికాగోర్ ఫిక్స్ చేశారు.

రాశి ఖన్నా:
రాక్షసుడు సినిమాకు రాశి కన్నా ను అనుకోగా ఆమె వద్దనడంతో అనుపమ ఫైనల్ అయింది.

నిత్యామీనన్:
మహానటి సినిమాలో నిత్యా మీనన్ ను అనుకున్నారు కానీ కీర్తి సురేష్ ఫైనల్ అయింది.

సురభి:
జెంటిల్మెన్ సినిమా కు సురభీ అని అనుకున్నారు..కానీ నిత్యామీనన్ ను  ఫైనల్ చేయాల్సి వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: