టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా కూడా హెబ్బా పటేల్ కు ఉన్న స్దానం వేరే. అమ్మడు చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అభిమానులు ఆమె అందం కోసమే ధియేటర్స్ కు వెళ్లి మరి ఆ సినిమాను చూస్తారు. అప్పుడేప్పుడో 2014 లో రాహుల్ రవీంద్ర హీరోగా 'అలా ఎలా' అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హెబ్బా.. ఇప్పటికి సరైన హిట్ కొట్టకపోయినా అభిమానులని మాత్రం సంపాదించుకుంది. ఇక రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'కుమార్ 21ఎఫ్' మూవీలో హీరోయిన్ గా నటించిన హెబ్బా పటేల్‌ ఫస్ట్ టైం సినిమా సక్సెస్ ను రుచి చూసింది. ఈ సినిమాతో అమ్మడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత "ఈడో రకం ఆడో రకం", "అంధగాడు", "ఎక్కడికి పోతావు చిన్నవాడా" వంటి సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఏం కూడా ఆశించినంత హిట్ అందుకోలేకపోయాయి. దీంతో  హెబ్బా పాపులారిటీ కొంచెం తగ్గింది. కానీ ఫ్యాన్స్  లో ఉన్న ఫాలోయింగ్ చూసి అమ్మడుకు  వరుస ఆఫర్లు వరించాయి. ఈ క్రమంలోనే 'ఏంజెల్', 'మిస్టర్', '24 కిస్సెస్' సినిమాలు చేసింది. ఆ సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా  కొట్టడంతో అవకాశలు నిల్ అయ్యిపోయాయి.

హాట్ హాట్ ఫోజులు ఇస్తూ కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈమె వైపు స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. దర్శక నిర్మాతలు కూడా ఈమెను పట్టించుకోవడం మానేసారు. దీంతో హెబ్బా పటేల్ హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ టైం గడిపేస్తుంది. కాగా, హెబ్బా పటేల్ కు కోపం ఎక్కువ వస్తుందనే టాక్ ఉంది.  ఈ క్రమంలోనే ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న హెబ్బాపటేల్ ను యాంకర్  ఇబ్బందికర ప్రశ్నలతో విసిగించాడట. ఓప్పికగా చూసిన ఆమె ఇంకా పిచ్చి పిచ్చి ప్రశ్నలు  వేయడంతో  సహనం కోల్పోయి.. యాంకర్ ను తిట్టేసిందట. " ఏం మాట్లాడుతున్నావ్ రా మాదాపూర్" అంటూ లైవ్ లోనే  తిట్టి మైక్ విసిరికొట్టి బయటకు వచ్చేసిందట. ఆశ్చర్యం  ఏమిటంటే.. ఈ ఇంటర్వ్యూ తర్వాత హెబ్బా పటేల్ ఇంటర్వ్యూలకే రావడం లేదట. తాను ఏం చెప్పాలి అనుకున్నా..తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతోనే పంచుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: