టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు రిలీజ్ అయిన పలు పోస్టర్లు సినిమాపై మరింతగా అందరిలో అంచనాలు పెంచేసాయి అనే చెప్పాలి. యువ దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథ కి దృశ్యరూపకంగా మరికొంత ఫిక్షన్ స్టోరీ ని జోడించి తీస్తున్నారిని టాలీవుడ్ వర్గాలలో న్యూస్.

సక్సెస్ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమా యొక్క సౌత్ వర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ అలానే హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ సంగీతం అందిస్తుండగా మనోజ్ పరమహంస ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని నేడు సాయంత్రం 5 గం.లకు విడుదల చేయనున్నాం అంటూ నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే నేడు సాయంత్రం 5 దాటినప్పటికీ సాంగ్ రిలీజ్ కాకపోవడం, ఆపైన టెక్నీకల్ ఇష్యూ రావడంతో సాంగ్ రిలీజ్ మరింతగా ఆలస్యం చేసారు నిర్మాతలైన వంశీ, ప్రమోద్.

అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్, ట్విట్టర్ లో వారిపై నెగటివ్ ట్రెండ్ చేయడంతో పాటు మరొక అభిమాని ఏకంగా తమ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో నిర్మాతలు ఆడుకుంటున్నారు, వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయండి సర్ అంటూ హైదరాబాద్ పోలీస్ లని ట్యాగ్ చేసాడు. అనంతరం అతడి ట్వీట్ పై స్పందించిన హైదరాబాద్ పోలీసులు, వారిద్దరిపై లిఖితపూర్వకంగా మీరు కంప్లైంట్ ఇస్తే వారిని అరెస్ట్ చేస్తాం అంటూ వారు కూడా సరదాగా రిప్లై ఇవ్వడంతో వారి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మొత్తంగా దీనితో ఒకింత రాధేశ్యామ్ కి పబ్లిసిటీ మరింతగా పెరిగినట్లయిందని అంటున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: