కింగ్ అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య తాత మనవడు గా నటిస్తున్న చిత్రం 'బంగార్రాజు'. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం ఇటీవలే తూర్పుగోదావరి లో షూటింగ్ పూర్తి చేసుకొని మైసూర్ లో సందడి చేయనుందని సమాచారం.దీనికి సంబంధించిన ఫొటోస్ నాగార్జున తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారని తెలుస్తుంది.ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని సమాచారం.

కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బంగార్రాజు' నాగార్జున, రమ్యకృష్ణ మరియు నాగచైతన్య, కృతీశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు ఇటీవల ఈ చిత్రం నుండి లడ్డు ఉండా అంటూ ఒక సాంగ్ కూడా విడుదలైందని సమాచారం..

అయితే తాజాగా ఈ సినిమా మైసూర్ లో వారం రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ జరగనుందని తెలుస్తుంది.నాగచైతన్య, కృతీశెట్టి కాంబినేషన్‌లో వచ్చే లవ్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారని తెలిసిందని మైసూర్‌ షెడ్యూల్‌ పూర్తికాగానే తర్వాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేస్తారట 'బంగార్రాజు' చిత్ర బృందం.

2016లో సూపర్ హిట్ అయినా 'సోగ్గాడే చిన్నినాయానా' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' రూపొందుతోన్న విషయం అందరికి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్ ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తుంది.రావు రమేష్, వెన్నెల కిషోర్ మరియు చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని సమాచారం.ఇప్పటికే విడుదలైన లడ్డుందా పాటతో మంచి రెస్పాన్స్ అందుకుంది బంగార్రాజు. టాలీవుడ్ లో ఒక బాడ్ సెంటిమెంట్ వుంది సూపర్ హిట్ అయిన మొదటి భాగం సినిమా రెండో భాగం అట్టర్ ప్లాప్ అవుతుందట. మరి చూడాలి సోగ్గాడు ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడో లేదో...!

మరింత సమాచారం తెలుసుకోండి: