పుష్ప సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఒక్క విషయం మాత్రం పుష్ప సినిమా యూనిట్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. దాన్నుంచి బయటపడేందుకు చిత్ర బృందం తెగ కష్టపడుతోంది. సినిమా విడుదల తేదీని ప్రకటించినా.. ప్రమోషన్స్‌ మొదలుపెట్టినా.. బన్నీ అండ్‌ టీమ్‌కి ఇంకా స్పష్టత రావడం లేదట. రెండు ఆప్షన్స్‌లో ఏది బెటర్‌, ఎవరిని సెలక్ట్ చేసుకుంటే సినిమాకి ప్లస్‌ అవుతుందని లెక్కలేస్తున్నారట.

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కి టాలీవుడ్‌ మ్యూజిక్‌ వరల్డ్‌లో క్రేజీ ఇమేజ్‌ ఉంది. ముఖ్యంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్స్‌ వస్తాయని రికార్డ్‌ ఉంది. 'పుష్ప పార్ట్‌1' సినిమాలో కూడా అదిరిపోయే ఐటెమ్‌ సాంగ్‌ ఉందని కామెంట్స్‌ వినిపించాయి. బన్ని కూడా 'పుష్ప' సాంగ్స్‌ సూపర్‌గా వస్తున్నాయని చాలా వేదికల్లో చెప్పాడు. అయితే సాంగ్స్‌ ఫైనల్‌ అయినా ఐటెమ్‌ గర్ల్‌గా ఎవరిని తీసుకోవాలనేది ఇంకా తేలలేదట.

'పుష్ఫ' సినిమా డిసెంబర్‌ 17న  తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతోంది. దీంతో హిందీ జనాలకు కూడా పరిచయమున్న స్టార్‌తో ఐటెమ్‌ సాంగ్‌ చేయిస్తున్నారని.. దిశా పఠాని, సన్నీ లియోన్‌ లాంటి వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారనే కామెంట్స్‌ వచ్చాయి. కానీ ఇప్పుడు వీళ్లెవరూ కాదని, మరో ఇద్దరిని పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

'పుష్ప' ఐటెమ్‌ సాంగ్‌కి పూజా హెగ్డే, లేకపోతే తమన్నాని తీసుకోవాలి అనుకుంటున్నారట. పూజాని బన్ని లక్కీగా ఫీలవుతున్నాడు గానీ, ఇప్పటికే 'రంగస్థలం'లో చేసిన పూజాని తీసుకుంటే కొత్తగా ఉండదేమో అనుకుంటున్నాడట. అయితే తమన్న ఇప్పటికే చాలా సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసింది. దీంతో ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారట మేకర్స్.

చూద్దాం.. పుష్ప యూనిట్ కు ఐటమ్ గాళ్ ఎప్పుడు దొరుకుతుందో. దానికోసం మేకర్స్ మాత్రం తెగ కృషి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉత్కంఠకు సినిమా యూనిట్ ఎప్పుడు తెరదించుతుందో చూడాలి.







మరింత సమాచారం తెలుసుకోండి: