మన తెలుగులో ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే కమర్షియల్ సినిమాల విషయంలో చాలా ఆసక్తి కరం గా ఉండటమే కాకుండా భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ ముందుకు వెళుతుంది. తెలుగులో పూజా హెగ్డే అగ్ర హీరోల నుంచి బాగా సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి కొంత మంది అగ్ర హీరోలు కూడా ఆసక్తి చూపించడం ఈ మధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రస్తుతం తెలుగులో రష్మిక మందన లేకపోతే పూజా హెగ్డే ఇద్దరు కాదు అనుకుంటే కీర్తి సురేష్ పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి.

ఇతర భాషలకు చెందిన కొంత మంది హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినబడినా సరే వీళ్ళ ముగ్గురు మించి పెద్దగా తెలుగులో సినిమాలు చేసే హీరోయిన్లు ఎవరు కనపడటం లేదని చెప్పాలి. సీనియర్ హీరోయిన్లు కాజల్ అలాగే సమంత కొన్ని కొన్ని విషయాల్లో కాస్త వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో వీరిని పక్కనపెట్టి వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే పూజా హెగ్డే తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలోనే అగ్ర హీరోల సినిమాల కోసం అవసరమైతే రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటుంది అంటున్నారు.

ఇటీవలి కాలంలో కీర్తి సురేష్ ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ను పక్కన పెట్టడానికి కొంత మంది నిర్మాతలు రెడీ అవుతున్నారు. చిరంజీవి సినిమా కోసం దాదాపుగా ఆమె కేవలం చెల్లెలు పాత్ర కోసమే రెండు కోట్లకు పైగా తీసుకోవడంతో  పక్కన పెట్టేందుకు సిద్దమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా సరే పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా హైలైట్ అవుతున్న ఆప్షన్ గానే చెప్పుకోవాలి. మరి భవిష్యత్తులో ఆమె ఏం చేస్తుంది ఏంటి అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: