మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరుశురాం తొలిసారి ఓ పెద్ద స్టార్ హీరో ను డీల్ చేస్తుండటం విశేషం.

చిన్న సినిమాలతో ఇప్పటి వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చి గీత గోవిందం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని మహేష్ బాబు కళ్ళల్లో పడ్డాడు పరశురామ్. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ మంచి కథను చెప్పి ఒప్పించి ఇప్పటిదాకా ఆయన తో సినిమా ను తీసుకువచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ స్థాయిలో వ్యూస్ అందిస్తూ ప్రేక్షకులు ఈ సినిమా పై పెట్టుకున్న నమ్మకాన్ని తెలియజేశారు. 

సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద సినిమాల విడుదలలు ఉన్న కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ చిత్రం విడుదల చేసుకోవడం మహేష్ అభిమానులను ఎంతగానో సంతోషాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కూడా వెల్లడి చేస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేయడంలో ఎందుకు ఆలశ్యం చేస్తున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు కొంత మందిలో ఉంది. ఇతర సినిమాలు వారి వారి సినిమా పాటలను విడుదల చేసి క్రేజ్ పెంచుకుంటూ ఉంటే మహేష్ మాత్రం పాటలను విడుదల చేయకపోవడం అందరినీ నిరాశపరుస్తుంది. మహేష్ ఈ విషయంలో తొందర పడాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: