అల్లు
అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా
సినిమా పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి
సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా పాన్
ఇండియా సినిమాగా
అల్లు అర్జున్ తొలి సారి చేస్తున్న ఈ
సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురం
సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఒక్కసారిగా
అల్లు అర్జున్ రేంజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. అంతకు ముందు కూడా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఇంతవరకు వచ్చిన
అల్లు అర్జున్ ఇకపై కూడా మంచి సినిమాలు మాత్రమే చేయాలని చెప్పి
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను మొదలు పెట్టాడు. ఇక పుష్ప మొదటి భాగం
డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా కు దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఆ మధ్య టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ను రాబట్టింది.
యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి ఈ చిత్రం మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ ఆకర్షణ కాగా ఇప్పటికే వచ్చిన మూడు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సినిమా పై కూడా మంచి అంచనాలను పెంచుతుంది.
ఇకపోతే రెండవ భాగం చిత్రీకరణ ఇంకా మొదలు కూడా పెట్టకపోవడంతో ఇది ఎప్పుడు మొదలయ్యి ఎప్పుడు విడుదల అవుతుందో అన్న సందేహాన్ని అందరూ వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు
సుకుమార్ తర్వాత
విజయ్ దేవరకొండ తో
సినిమా చేస్తుండడంతో ఈ
సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యంగా పని చేసే
సుకుమార్ మరొకసారి ఆ విషయంలో తాను వీక్ అని ఈ
సినిమా తో నిరూపించుకున్నాడు. ఇప్పుడు పుష్ప సినిమ రెండవ భాగం ఎప్పుడు పూర్తి అవుతుందో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.