ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమంలో బిగ్బాస్ ఇస్తున్న టాస్కులు కాస్త అటు రోజురోజుకీ హౌస్ ని వేడివేడిగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు హౌస్ లో స్నేహితులుగా ఉన్న వారందరూ టాస్క్ లో తలబడుతూ ఏకంగా శత్రువులుగా మారిపోతున్నారు. ఇలా బిగ్ బాస్ హౌస్ కాస్తా రోజులు దగ్గర పడుతున్న కొద్దీ  వాడి వేడిగానే మారిపోతుంది. ఎవరి గేమ్  వారు ఆడుతూ ఉండడంతో ఇక ఈ షో చూస్తున్న ప్రేక్షకులు అందరికి కూడా ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో సన్నీ, మానస్, కాజల్ ముగ్గురు కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఈ ముగ్గురు స్నేహితులు ఎప్పుడు పంచుకుంటారు. కానీ ఇటీవలే మాత్రం కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ లో భాగంగా ఈ ముగ్గురి మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తూ ఉంటే ఇక స్నేహితులు కాస్త విడిపోతున్నారు అన్నట్లుగా అర్థమవుతుంది. గేమ్ లో భాగంగా చిన్న తప్పు జరిగినందుకు తన స్నేహితులైన కాజల్ మానస్ పైన ఎంతగానో కోపంతో విరుచుకుపడ్డాడు సన్నీ.



  ఇక ఆ తర్వాత విడుదలైన ప్రోమో నేటి ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన టాస్క్ అందరూ ఎంతో సిన్సియర్ గా ఆడుతూ ఉంటారు. ఇంతలో పవర్ రూమ్ కు వెళ్లేందుకు అవకాశం ఉండగా వెంటనే శ్రీరామ్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. పవర్ రూమ్ కి వెళ్ళిన తర్వాత బిగ్బాస్ శ్రీ రామ్ కి ఒక సీక్రెట్ పవర్ ఇస్తాడు. అయితే ఇక పవర్ రూమ్ నుంచి బయటికి వచ్చిన శ్రీరామ్ ఈ పవర్ ఎవరికైనా కావాలంటే నాకు గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి అని చెబుతాడు. దీనికి అంగీకరించి గోల్డ్ కాయిన్ ఇస్తాడు రవి. కానీ ఆ పవర్ ఏం వచ్చింది ఏంటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రవి. దీంతో అసలు పవర్ రూమ్ లో శ్రీ రామచంద్రకు ఏం వచ్చిందో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: