మెగాస్టార్ చిరంజీవికి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రజలందరూ కూడా అమితంగా అభిమానించే హీరో గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ప్రస్తుతం తెలుగు  చిత్ర పరిశ్రమ పెద్దగా కొనసాగుతున్నారు. అయితే ఇక ప్రస్తుతం 60 ఏళ్ళు దాటినప్పటికీ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్న వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా వ్యాఖ్యలు చేశారు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఏవైనా పోస్టులు పెట్టిన లేదా మీడియా వేదికగా ఏవైనా మాటలు మాట్లాడిన ఆ మాటలు కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇటీవలే యోదా లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవానికి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మనసులో మాట బయట పెట్టారు. ఆయన రాష్ట్రపతి స్థానం లోకి వెళ్తే చూడాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.



 ఇప్పటికే ఉప రాష్ట్రపతిగా కొనసాగుతూ  తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన వెంకయ్య నాయుడు ఇక రానున్న కాలం లో రాష్ట్రపతి కావాలి అని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. వెంకయ్య నాయుడు దేశ ప్రథమ పౌరుడు కావాలని తాను మాత్రమే కాదు ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి కోరుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి అవకాశం వస్తే మంచితనంతో ఎందుకులే అని అనవద్దని ఆ పదవిని స్వీకరించాలి అంటూ మెగాస్టార్ కోరారు. అయితే ఒక తెలుగు వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉన్నాడు అన్న విషయాన్ని తెలుగు వాళ్లు అందరూ మాట్లాడుకుంటే బాగుంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: