నటీమణులు తమ అందచందాలతో ప్రాంతీయంగా గుర్తింపు తెచ్చుకుంటారు. టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ లలో  గుర్తింపు తెచ్చుకున్న నటిమణులు వారి నెక్స్ట్ టార్గెట్ మాత్రం  బాలీవుడ్ . ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం వారి చిరకాల కల. అయితే ఇప్పటికే పలువురు టాలీవుడ్ భామలు తమన్నా , కాజల్ , కీర్తి సురేష్ , పూజ హెగ్డే మరియు  తాప్సి పన్ను ఇలా ఎంతో మంది గ్లామర్ క్వీన్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ లో అడుగుపెట్టారు . అడుగు పెట్టడమే కాకుండా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు కూడా .



IHG





సమంత కూడా ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కూడా . వీరి బాటలోనే అందాల నటి రాశి ఖన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తెలుగు మరియు తమిళ భాషల్లో చాల బిజీగా ఉన్న ఈ బొద్దు గుమ్మా టార్గెట్ ఇప్పుడు బీటౌన్‌ కు షిఫ్ట్ చేసింది . ఆమెకు ప్రస్తుతం వరుస ఆఫర్లను అంది పుచ్చుకుంటూ దూసుకు పోతు ఉంది.

IHG

 
నటి రాశి ఖన్నా ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లతో వేగంగా దూసుకుపోతూ ఉంది . అందులో ఒకటి షాహిద్ సరసన ' సన్నీ '  మూవీ మరొకటి అజయ్ దేవగన్ కీలక  పాత్రలో తెరకెక్కుతున్న ' రుద్రా '  మూవీ , అయితే ఈ రెండు వెబ్ సిరీస్ లు నిర్మాణం లోనే ఉన్నాయ్. అయితే ప్రస్తుతం మరో అవకాశం ఆమె కు  తలుపుతట్టింది. బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థను కలిగిన కరణ్ జోహార్ నిర్మాణ సారధ్యం లో ఓ భారీ మూవీ చిత్రీకరణకు సిద్ధంగా ఉంది . అయితే ఈ సినిమాకు ' యోధ ' అనే టైటిల్ ను ఖరారు  చేసారు. అయితే ఈ చిత్రం లో రాశి ఖన్నా పాత్రకు ప్రాధాన్యత ఉండటం తో ఆమె వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అంతే కాకుండా ఈ చిత్రం లో సిద్దార్థ్ మల్హోత్రా , దిశా పటానీ లు ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. పుష్కర్ ఓజా అనే క్రొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


IHG

అయితే ఇప్పటికే రాశీఖన్నాను ఈ చిత్ర లో నటింప చేయాలనీ ఈ చిత్ర బృందం భావిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కనుక నిజం అయితే కనుక రాశి ఖన్నా పంట పండినట్లే. బాలీవుడ్ లో ఆమెకు మంచి బ్రేక్ రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయ్. రాశి ఖన్నా హీరోయిన్ గా గోపీచంద్ తో ' పక్క కమర్షియల్ ' మూవీ ని చేస్తూవుంది. హీరో నాగ చైతన్యతో ' థాంక్యూ ', హీరో కార్తీ తో 'సిద్దార్థ్ ' అనే మూవీ లలో ప్రస్తుతం నటిస్తూ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: