చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి మృతి చెందారు. రంగస్వామి మృతిపై పలువురు సంతాపం తెలియజేసి ఆయనకు నివాళులుఅర్పించారు. మోహన్‌బాబు సోదరుడు రంగస్వామి బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో ఒక్కసారిగా మోహన్బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆయన మరణం గురించి తెల్సిన సినీ ప్రముఖులు, ప్రముఖులు అందరు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అయితే రంగస్వామి అంత్యక్రియలు గురువారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ బాబు అన్న రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. అంతేకాదు.. మోహన్బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉండేవారంట.

మోహన్ బాబు వాళ్ళ అమ్మకి ఐదుగురు సంతానం. వారిలో ఒక్కరు రంగస్వామి. అయితే రంగస్వామి అన్నయ్య మంచు మోహన్‌బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, ఎడ్యూకేషనలిస్ట్ గా రాణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మోహన్ బాబు కుటుంబం హైదరాబాద్ లో స్థిర పడగా.. రంగస్వామి తిరుపతిలో స్థిరపడ్డారు. ఆయన తిరుపతిలో రైతుగా పని చేసుకుంటూ జీవనం సాగించారు. ఇక చాలా ఏళ్లుగా మోహన్‌బాబు,అతని ఫ్యామిలీ నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలలో రంగస్వామి చురుకుగా పాల్గొంటూ ఉండేవాడు.

అంతేకాదు.. మోహన్ బాబుకి సంబంధించిన గ్రౌండ్‌ లెవల్‌లో అన్ని పనులను చూసుకుంటూ ఉండేవారంట. రంగస్వామి భార్య కాంతమ్మ కూడా ఉన్నారు. ఇక రంగస్వామి నాయుడు మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, రైతులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అంతేకాదు.. మోహన్ బాబు ఇండస్ట్రీలో ఐదు వందలకుపైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోలలో ఒక్కరిగా ఎదిగారు. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు విష్ణు గెలిచిన సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: