నాగచైతన్యకు జోడిగా బేబమ్మ అలియాస్ కృతి శెట్టి జత కట్టనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల కాగా ఇందులో ఈమె నాగలక్ష్మి గా మనకు కనిపించనున్నారు. కృతి శెట్టి ఫస్ట్ లుక్ సినిమా నుంచి విడుదల చేస్తూ ఆ విషయాన్ని , నాగచైతన్య ఒక రూపంలో తెలియజేసాడు. నాగచైతన్య, కృతి శెట్టి పోస్ట్ కు సంబంధించిన ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేయగా.. ఇక ఇది చూసిన నాగార్జున, నాగచైతన్యను ఒక ప్రశ్న అడిగారు.
అంతా బాగానే ఉంది కానీ.. మరి బంగార్రాజు మాటేమిటి.. అని నాగార్జున నాగచైతన్య అని ప్రశ్నించాడు.. ఈ ప్రశ్నకు తాజాగా నాగచైతన్య రిప్లై ఇచ్చాడు.. ట్విట్టర్లో తన తండ్రిని ట్యాగ్ చేస్తూ త్వరలోనే బంగార్రాజు కూడా వస్తున్నాడు.. లేడీస్ ఫస్ట్ కదా.. అందుకే మా నాగలక్ష్మి కి సంబంధించిన ఫస్ట్ లుక్ షేర్ చేస్తున్నాను అని చైతన్య తెలిపాడు. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి స్వరాలు అందించగా, ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.