నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తుండగా, శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో బాలకృష్ణ రైతు గా అఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్ లను, ట్రైలర్ ను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు కూడా పెంచేశాయి.

 అయితే ఇలా అఖండ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కబోయే  సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కథ కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది అని అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇక పోతే మిగతా కథ అమెరికా నేపథ్యంలో నడుస్తుంది అని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమాను కూడా అదిరిపోయే యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు గోపీచంద్ మలినేని ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: